అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. హార్స్లీ హిల్స్ వెళ్లిన పర్యాటకులకు రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. దీంతో పర్యాటకులకు భయపడిపోయారు. టూరిస్టులకు చిరుత కనిపించిందన్న వార్తలతో స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతేడాది ఫిబ్రవరిలోనూ మూడు చిరుతలు రోడ్డు దాటుతూ కనిపించడం కలకలం రేపింది. అయితే వేసవి కావటంతో ఆహారం, దప్పికలతో అడవి నుంచి వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.