తెలుగు చిత్ర పరిశ్రమ సినీ కార్మికుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఒకప్పుడు మద్రాసు నుంచి పరిశ్రమను హైదరాబాద్కు తరలించడంలో మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృషిని ఆయన గుర్తుచేశారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదగడంలో కార్మికుల పాత్ర గొప్పదని కొనియాడారు. సినీ కార్మికుల కష్టాలు తనకు తెలుసని భరోసా ఇస్తూ, హాలీవుడ్ను కూడా హైదరాబాద్కు తీసుకొస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలో స్థలాలు, కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు.