హైదరాబాద్ బిట్స్ పిలానికి చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అద్భుతం చేశారు. తమ హాస్టల్ రూంలోనే 300 కి.మీ వేగంతో, రాడార్కు చిక్కని కమికేజ్ డ్రోన్లను తయారు చేశారు. అంతే కాదు.. భారత సైన్యానికి ఆ డ్రోన్లను విక్రయిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ విదేశాల నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకోవటాన్ని తగ్గించడమే లక్ష్యంగా, సాధారణ విడిభాగాలతోనే ఈ డ్రోన్లను రూపొందించారు. లింక్డ్ఇన్ ద్వారా ఆర్మీ అధికారులకు పరిచయం చేసి, డెమోలతో ఆర్డర్లు దక్కించుకున్నారు.