బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ వార్డులో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కాగా, అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చేరే ముందు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు డైలీ సీరియల్ మాదిరిగా సాగుతోందని విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ అయిందని ఫిర్యాదు చేసినా సిట్ తనను విచారించలేదన్నారు.