హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. హిందువుల పండగలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. 9వ నిజాంలాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న రాజాసింగ్.. హిందూ పండగలు ఎలా జరుపుకోవాలో మీరు మాకు చెబుతారా? అని ప్రశ్నించారు. హోలీ పండగను పన్నెండు గంటల వరకే చేసుకోవాలా ? అంటూ నిలదీశారు. హోలీ వేడుకలకు గూమి కూడవద్దని చెబితే ఎలా? అని నిలదీశారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్కు పట్టిన గతే మీకూ పడుతుందంటూ రేవంత్ రెడ్డిని రాజాసింగ్ హెచ్చరించారు.