ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రజలకు వరాలు కురిపించారు. శనివారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిని బాలయ్య సందర్శించారు. వైద్యులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామన్న బాలయ్య.. ఆస్పత్రిలో వైద్యుల కొరతను పరిష్కరిస్తామన్నారు. హిందూపురానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని. స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములు సేకరిస్తామన్న బాలకృష్ణ.. అందుకు న్యాయమైన ధర అందిస్తామని తెలిపారు.