హిందూపురంలో వైసీపీ ఆఫీసుపై దాడి జరిగింది. హిందూపురం వైసీపీ ఇంఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వేణు రెడ్డి ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో దాడి చేసినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు తావులేదన్నారు.