శ్రీసత్యసాయి జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. హిందూపురం తూముకుంట చెక్పోస్టు వద్ద ఎస్బీఐ బ్యాంక్లో చోరీ జరిగింది. బ్యాంక్ వెనుకవైపు ఉన్న కిటికిని కట్టర్లతో కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. సినిమా తరహాలో సీసీటీవీ వైర్లను తొలగించి చోరీకి పాల్పడ్డారు. బ్యాంకులోని 10 కేజీల బంగారం, 38 లక్షల నగదు దోచుకెళ్లారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దొంగల కోసం గాలిస్తున్నారు.