రంగురంగుల బెలూన్లలో నింపే హీలియం వాయువును మన తెలుగు నేలపైనే కనిపెట్టారని ఎంత మందికి తెలుసు? అవును, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో హీలియం మూలకాన్ని కనుగొన్నారు. 1868 ఆగస్టు 18న ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సన్ గుంటూరులో సూర్యగ్రహణాన్ని గమనిస్తూ.. హీలియం మూలకాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆస్ట్రోనమర్ నోర్మాన్ లోక్యెర్ కూడా హీలియంను గుర్తించడంతో.. ఇద్దరికీ కలిపి ఈ ఆవిష్కరణ క్రెడిట్ దక్కింది. అయితే గుంటూరులో ఈ మూలకం కనుగొనడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఇవే.