హుస్సేన్ సాగర్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ప్రమాదం జరగ్గా.. తీవ్రంగా గాయపడి రెండ్రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇక ఘటన తర్వాత కనిపించకుండా పోయిన అజయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.