తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి నుంచి కామాఖ్య ఆలయం మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో నడిచే ఈ అమృత్ భారత్ రైలు.. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ రైలు చర్లపల్లిలో ప్రారంభమై.. ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా కామాఖ్య ఆలయానికి చేరుకోనుంది.