ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు కన్నుమూశారు. మరోవైపు హెచ్జే దొర మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. డీజీపీగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. నక్సల్స్ సమస్యకు పరిష్కారం చూపటంలో హెచ్జే దొర కృషిని చంద్రబాబు కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.