ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్పై ఏసీబీ భారీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, నిజామాబాద్లోని 10కుపైగా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో భారీ స్థిర, చరాస్తులు, బంగారం, నగదు, బ్యాంక్ లాకర్లు, విదేశీ మద్యం బాటిళ్లు గుర్తించారు. బచ్చు రవీందర్ ఆస్తులు రూ.100 కోట్లకుపైనే ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అనంతరం బచ్చు రవీందర్ను అరెస్ట్ చేశారు.