మాజీమంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. అయితే, ఆయన తన వ్యాఖ్యలపై తప్పు తెలుసుకుని ప్రెస్మీట్ పెట్టి క్షమాపణలు చెప్పారు. కానీ, టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఇదే సమయంలో ఆయన నివాసంపై కూడా దాడి జరిగింది. దీంతో అంబటి తనపై నమోదయిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారించింది.