హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్.. ఇలా చేయడం తప్పే అంటూ క్షమాపణలు చెప్పిన రంగనాథ్..

6 months ago 16
హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరై క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట పరిధిలోని ఓ ప్రైవేటు స్థలం విషయంలో యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించారు. నవంబరు 27న హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ వేయగా.. కోర్టు తీవ్రంగా స్పందిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో కమిషనర్ రంగనాథ్ శుక్రవారం కోర్టుకు హాజరై.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.
Read Entire Article