కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ వారు వేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అసెంబ్లీలో నివేదికను చర్చించిన తర్వాతే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. అసెంబ్లీలో ఈ నివేదిక ఎప్పుడు చర్చకు వస్తుందో వేచి చూడాలి.