హైదరాబాద్ మధురానగర్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉంటున్న ఇల్లు చెరువు బఫర్ జోన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను ఉంటున్న ఇంటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆధారాలతో సహా వెల్లడించారు.