హైదరాబాద్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ శనివారం రోజున ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. హైదరాబాద్ నగర ప్రజలు.. తమ ఫిర్యాదులు చేసేందుకు ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనాలని హైడ్రా సూచించింది. గతంలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోయినా.. ఫోన్ ఇన్లో ఫిర్యాదు చేయవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని హైడ్రా చేపడుతోంది.