హైడ్రా తెచ్చిన సంబురం.. పండగే పండగ..

1 year ago 56
హైదరాబాద్ శివార్లలోని ఫిర్జాదిగూడ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో చిక్కుకున్న రెండు ఎకరాల శ్మశానవాటిక భూమిని తిరిగి పొందడంతో స్థానికులు ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గుమిగూడిన ప్రజలు, టెంట్లు వేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. టపాసులు పేల్చి తమ సంతోషాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా.. సమస్య పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీడెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) పనితీరును ప్రశంసిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
Read Entire Article