హైదరాబాద్ ఐటీ కారిడార్లో హైడ్రా అధికారులు.. భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఏకంగా రూ.1200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించారు. ఏకంగా 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాగా.. అందులో ఉన్న నిర్మాణాలను తొలగించి.. హైడ్రా అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంస్థలు ఈ భూములను ఆక్రమించుకున్నట్లు గుర్తించిన హైడ్రా.. అక్కడ ప్రభుత్వ భూమికి సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసింది.