పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఔట్ లోని 2218 మంది ప్లాట్ యజమానులు తమకు విముక్తి కల్పించినందుకు హైడ్రాకు (HYDRA) కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. నల్లమల్లారెడ్డి అనే వ్యక్తి 200 ఎకరాల లేఔట్ చుట్టూ 4 కిలోమీటర్ల భారీ ప్రహరీ గోడను నిర్మించి, ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుగోడలు వేశాడు. ఈ ప్రహరీ కూల్చివేతతో పాటు.. రహదారుల ఆక్రమణలను తొలగించడం వల్ల అనేక కాలనీలకు అనుసంధానం మెరుగుపడింది. యజమానులు హైడ్రా కృషిని కొనియాడారు.