హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ తెచ్చిన హైడ్రా వ్యవస్థపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించింది. అలానే హైడ్రా వాహనాల రంగులపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అలానే రాష్ట్రంలో ఎఫ్టీఎల్ పరిధిలోని వివాదాలపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.