హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అధికారులు అలెర్ట్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజే నీటి కటకట ఎదురవనుంది. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో.. అధికారులు ఆ ప్రాంతంలోని పీఎస్సీ పైప్ లైన్ను వేరే చోటుకి మార్చే పనులను జలమండలి చేపట్టనుంది. దీంతో.. మార్చి 8వ తేదీన బీహెచ్ఈఎల్లోని ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.