హైదరాబాద్ మంగళ్హాట్ కేంద్రంగా సాగుతున్న భారీ ఆహార కల్తీ దందాను టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. జమ్మూ కశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్ కోసం గాలింపు చేపట్టారు.