హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబర్ పేట బాపూ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యభర్తలు ఉరేసుకొని చనిపోగా.. వారి కుమారుడు చేతిని కట్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.