హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రెండు రాష్ట్రాల్లో రహదారి ఎక్కడ మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశమై దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాణిజ్యపరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.