Hyderabad Temple: హైదరాబాద్ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అచ్చంగా ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంలో జరిగినట్టుగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలోనూ జరిగింది. అయితే.. కార్తీక శనివారం (నవంబర్ 23న) రోజున ఉదయం ఆరున్నర గంటల సమయంలో.. సూర్య భగవానుడి నుంచి ప్రసరించే లేలేత కిరణాలు నేరుగా ఆలయంలోని శివలింగాన్ని తాకాయి. అవి కాస్త.. ఆ శివయ్యకు తిలకం దిద్దినట్టుగా కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు.