హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. రెండో దశ విస్తరణలో భాగంగా ముందుగా ఓల్డ్ సిటీ మెట్రో రైలు పనులను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికే అత్యంత కీలకమైన భూసేకరణ పనులను ప్రారంభించింది కూడా. పలు చోట్ల కూల్చివేతలు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ సిటీ మెట్రో పనులను వెంటనే ఆపేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగ్గా.. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరింది.