హైదరాబాద్ను దేశంలోనే తొలి, అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను ఆఫ్షోర్ క్యాంపస్ల ద్వారా నగరానికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్తో పాటు హార్వర్డ్ వంటి సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పడుతున్నాయి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ తదితర సంస్థలతోనూ చర్చలు జరిగాయి.