అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ 'ఎల్పీఎల్ ఫైనాన్షియల్' తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్ను ప్రారంభించారు. హైదరాబాద్లో ఇప్పటికే 450కి పైగా జీసీసీలు ఉండగా.. ఎల్పీఎల్ రాకతో నగరం గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా మరింత బలోపేతం కానుంది.