హైదరాబాద్‌కు ముద్రగడ పద్మనాభం తరలింపు

7 months ago 19
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ముందుగా ముద్రగడను.. కుటుంబసభ్యులు ఆయన కోరికపై కిర్లంపూడికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ముద్రగడ వెంట పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ వంగా గీత కూడా కిర్లంపూడి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ముద్రగడ పద్మనాభం వెంట ఆయన కుమారుడు గిరిబాబు, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించనున్నారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కాకపోతే వైఎస్ జగన్ సూచనతో.. ముందస్తు జాగ్రత్తగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు వారు చెబుతున్నారు.ఇక ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం రాత్రి ముద్రగడ మరోసారి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ తరలించాలని భావించారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేందుకు అనుకూలంగా లేదనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ విషయం తెలియడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్‌లో పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒకవేళ అత్యవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ తరలించాలని సూచించారు. అయితే ముద్రగడ కాస్త కోలుకున్నారని చెప్పడంతో ట్రీట్మెంట్ కొనసాగించారు. అలా సోమవారం రోజు ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు.
Read Entire Article