హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జి హబ్గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన క్యాంపస్ను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఫ్యూచర్సిటీలోని ఎడ్యుకేషన్ జోన్లో శాశ్వత ప్రాంగణం నిర్మించే వరకు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో తాత్కాలిక తరగతులు నిర్వహించనున్నారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు యూజీసీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో మరిన్ని యూకే విద్యాసంస్థలు హైదరాబాద్ రావడానికి ఆసక్తి చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు.