చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ అధికారులు అంటించిన జప్తు నోటీసు ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే దీనికి, మెట్రో స్టేషన్కు ఎలాంటి సంబంధం లేదు. గతంలో మెట్రో పనుల కోసం థేల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ నోటీసు వర్తిస్తుంది. కంపెనీకి సంబంధించి మెట్రో పనుల కోసం తీసుకున్న విద్యుత్ కనెక్షన్కు సంబంధించి రూ.31,829 బకాయిలు ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. అయితే కంపెనీ అడ్రెస్ తెలియకపోవడంతో.. జప్తు నోటీసును మెట్రో స్టేషన్ వద్ద అంటించడం ఆసక్తికరంగా మారింది.