నగరవాసుల సౌకర్యార్థం.. హైదరాబాద్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO)లో స్పీడ్ పోస్ట్ సేవలు ఇకపై 24x7 అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి నైట్ షిఫ్ట్ బుకింగ్ను ప్రారంభించారు. దీని ద్వారా స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ అదనపు సౌకర్యం వల్ల అత్యవసరంగా తపాలా పంపవలసిన వారికి.. వాణిజ్య సంస్థలకు సమయం ఆదా అవుతుంది. బుకింగ్లు నిరంతరాయంగా జరగడం వలన.. పగటి కౌంటర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.