ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం వెళ్లాలంటే నల్లమల్ల అడవి నుంచి ప్రయాణించాల్సిందే. ఈ రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలను అనుమతించరు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీని వల్ల రాత్రివేళలోనూ ప్రయాణించడమే కాదు.. అడవి అందాలు, వన్య ప్రాణాలు, పులులను కూడా వీక్షించే అవకాశం లభిస్తుంది.