హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఐటీ క్యాపిటల్గా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఐటీ కారిడార్ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. దిగ్గజ సంస్థల రాకతో పెరిగిన డిమాండ్ దృష్ట్యా.. రాజేంద్రనగర్, గండిపేట, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో కొత్త ఐటీ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు టీజీఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రభుత్వ భూముల వేలం ద్వారా ఐటీ రంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.