హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి UMTA అధికారులు రోప్వే ప్రాజెక్ట్ను ప్రతిపాదించారు. మొదట, గోల్కొండ కోట, కుతుబ్షాహీ సమాధుల మధ్య దీనిని ప్రయోగాత్మకంగా నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్ వంటి ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలని చూస్తున్నారు. దీని వల్ల పర్యాటకులు సులభంగా ప్రయాణించవచ్చని, పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతుందని అధికారులు ఆశిస్తున్నారు.