హైదరాబాద్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఐదు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.