Hyderabad Couple Donates 18 Lakh House To TTD: తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన దంపతులు తిరుమల శ్రీవారికి ఇల్లు విరాళంగా అందించారు. మల్కాజ్గిరిలో ఉండే కనకదుర్గా ప్రసాద్, సునీత దేవి దంపతులు తమ ఇంటిని టీటీడీకి విరాళంగా అందించారు. సంతానం లేకపోవటంతో తమ తదనంతరం 250 గజాలు ఉండే ఇల్లును టీటీడీకి విరాళంగా అందిస్తూ వీలునామా రాసి. ఆస్తి పత్రాలను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి అందజేశారు. మరోవైపు మంగళవారం ఉదయం చెన్నై సంస్థ బంగారు శంఖు, చక్రాలను టీటీడీకి విరాళంగా అందించింది.