రానున్న వందేళ్ల అసరలకు తగ్గట్లుగా, అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనం నిర్మించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మౌళిక వసతుల కల్పనలో రాజీపడొద్దని సూచించారు. భవన నిర్మాణం జరిగే గోషామహల్ ప్రాంతంలో అవసరమైన చోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా కొత్తగా అండర్పాసులు నిర్మించాలని ఆదేశించారు.