హైదరాబాద్ నగరవాసులకు కేంద్ర రైల్వే మంత్రి తీపి కబురు చెప్పారు. ఎంఎంటీఏస్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగర పరిధిలో 82 కిలోమీటర్ల పొడవుతో ఆరు కొత్త లైన్లు జత చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో ఫలకునుమా-ఉమ్దానగర్ డబ్లింగ్ వంటి కీలక మార్గాలు ఉన్నాయన్నారు. రూ.1,169 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.