హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం అదృశ్యమైన కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆరు నెలల క్రితం జన్మించిన కవలల్లో.. మొదట ఒకరు చనిపోగా పూడ్చిపెట్టారు. ఆ తర్వాత మరో చిన్నారి కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే చనిపోవడంతో.. మొదట పూడ్చి పెట్టిన చిన్నారి శవం పక్కనే పూడ్చి పెట్టాలని వెళ్లారు. అయితే ఆ చిన్నారి మృతదేహం కనిపించకపోవడం, అక్కడ గుంత తీసి ఉండటంతో వారు షాక్కు గురయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.