బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. అటు సోషల్ మీడియాలోనే కాదు.. ఇటు పొలిటికల్ యాక్టివిటీస్లోనూ నేరుగా పాల్గొంటున్నారు. శుక్రవారం (నవంబర్ 22న) జాగృతి కార్యకర్తలతో సమావేశం అయిన కవిత.. ఈరోజు (నవంబర్ 23న) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు.