బేగంపేట, రామంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థుల నుంచి 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీరికి మొత్తం ఆరు సీట్లు కేటాయించారు. లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన వారు లక్డికాపూల్లోని కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఎస్సీ విద్యార్థులు నాంపల్లిలోని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.