హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రానిదేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని తెలిపిన రేవంత్ రెడ్డి.. రక్షణ రంగానికి సంబంధిన ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లోనే ఉండటం సంతోషకరమని చెప్పుకొచ్చారు.