Jashodaben Visit Hyderabad:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ భార్య యశోదా బెన్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఆమె తన సోదరుడు, మరో 18 మంది బంధువులతో కలిసి నగరంలోని పలు చారిత్రక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయాలను కూడా ఆమె దర్శించనున్నారు. గతంలో కూడా యశోదా బెన్ తెలంగాణలోని పలు ఆలయాలను దర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.