హైదరాబాద్ పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పురావస్తు శాఖ గుర్తించిన ప్రదేశాల్లో పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ నెల 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.