హైదరాబాద్ పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. 7.5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ మార్గానికి సంబంధించి స్తంభాల గుర్తింపు, ఆస్తుల సేకరణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 380 ఆస్తులకు రూ. 360 కోట్ల పరిహారం చెల్లించారు. పాతబస్తీ మెట్రోతో పాటు, తెలంగాణ ప్రభుత్వం మరో మూడు కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.