హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని, పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మిరాలం ట్యాంక్ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దే అంశాలపై సమీక్షించారు. నగరంలో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థను సంస్కరించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.