హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ, హెచ్ఎండీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట, డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తారు. ఇందుకుగానూ రక్షణ శాఖ 65 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం 435 ఎకరాలు రక్షణ శాఖకు కేటాయించనుంది. ఈ కారిడార్లు పూర్తయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.